త్రిలోక సంచారి అయిన నారదులవారు అలవాటు ప్రకారం ముల్లోకాలూ తిరుగుతూ ఒకసారి నరకం మీదుగా వెళుతున్నాడు. మామూలుకంటే భిన్నంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆలోకాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందాయనకు. "ఎప్పుడూ పాపుల హాహాకారాలతో, యమకింకరుల వికటాట్టహాసాలతో దద్దరిల్లుతుండే నరకమేనా ఇది" అని ఆశ్చర్యపోతూ దిగి నరకంలోకి ప్రవేశించాడు విషయం తెలుసుకుందామని. చూస్తే ఏముందీ, దిగాలుగా ఓ మూల నిలబడున్నాడు చిత్ర గుప్తుడు. ఆయనకు కొద్ది దూరంలో ముఖాలు వేళ్ళాడేసుకుని యమకింకరులు! శిక్షలు విధించటానికి తీసుకుని రాబడ్డ పాపులంతా తమలో తాము పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు. నారదుడి ఆశ్చర్యం రెట్టింపైంది. "చిత్రగుప్తా, ఏమిటి సంగతి, ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లు కనిపిస్తున్నావు?" అడిగాడు నారదుడు. "ఏం చెప్పమంటారు స్వామీ నా కష్టాలు? చాలా చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను. మీరే నన్ను కాపాడాలి. అసలే యమధర్మరాజులవారు వచ్చే సమయం అయ్యింది" అన్నాడు చిత్రగుప్తుడు, బావురుమనే గొంతుతో. నారదుడేదో బదులివ్వబోయే లోపు యమధర్మరాజు వస్తున్న సూచనగా గంట మోగనారంభించింది. చిత్రగుప్తుడూ మిగిలిన కింకరులూ ఎంతో ఆదుర్దాగా చూడటం మొదలుపెట్టారు. మరికొన్ని క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవ్వనే అయ్యాడు సమవర్తి.
వస్తూనే చిత్రగుప్తుడి మీద హుంకరించాడు "చిత్రగుప్తా, ఏం చేస్తున్నారు మన కింకరులంతా? ఇంతమంది పాపులని వదిలేసి కబుర్లు చెప్పుకుంటున్నారా??" వణుకుతున్న గొంతుతో బదులిచ్చాడు చిత్రగుప్తుడు, "అది కాదు మహాప్రభూ, వీరికి శిక్షలు విధించాలనే ప్రయత్నిస్తున్నాం కానీ...". "ఏమిటి కానీ? మీకు చేతకాకపోతే నేనే శిక్షిస్తా చూడండి.” యమధర్మరాజు ఠీవిగా వెళ్ళి ఒక పాపి దగ్గర ఆగి అడిగాడు. "ఏమిటి ఇతడు చేసిన పాపం?" చిత్రగుప్తుడు చిట్టా తెరిచి అతడు చేసిన పాపాల వివరాలన్నీ చదివాడు. "అలాగా, అయితే ఇతడిని తలక్రిందులుగా వేళ్ళాడ దీయించి, మంటలలో కాల్పించి, సలసల మరిగే నూనెలో వేయించండి." క్షణాలమీద ఏర్పాట్లు చేశారు యమ కింకరులు. కానీ యమధర్మరాజునే సంభ్రమానికి గురిచేస్తూ అదేదో పన్నీటి స్నానం చేస్తున్నట్లుగా అనుభూతి చెందసాగాడు అతడు. కణకణ మండే నిప్పులుగానీ సలసల మరిగే నూనెగానీ అతడికి కొంచెంకూడా బాధకలిగించడంలేదు. ఆశ్చర్యంతో తలపంకిస్తూ తరువాతి పాపి వద్దకు వెళ్ళాడు యముడు. ఈసారి అడగవలసిన అవసరంలేకుండానే అతడి పాపాల వివరాలన్నీ చదివి వినిపించాడు చిత్రగుప్తుడు. "ఇతడిని అత్యంత వాడియైన కత్తులు బల్లెములతో నిలువెల్లా పొడిపించి, ఒళ్ళంతా ఉప్పూ కారాలు రాయించండి" ఆజ్ఞాపించాడు యముడు. ఈసారీ ఫలితం లేకపోయింది. యముడు పరాభవాన్ని తట్టుకోలేక పోతున్నాడు. ఈసారి మూడవ పాపిని "ఏనుగులూ ఖడ్గమృగాలచే తొక్కించమని" ఆజ్ఞాపించాడు. మళ్ళీ అదే తంతు. పాపులంతా శిక్షలకు భయపడకపోగా వాటిని ఆస్వాదిస్తున్నారు. ఎంత కఠినమైన శిక్ష అయినా కూడా వారిని బాధించలేక పోతోంది. "ఇదీ సంగతి, ఇప్పటికైనా అర్థమయ్యిందా ప్రభూ" అన్న భావం కనిపించింది యముడికి చిత్రగుప్తుడి కళ్ళల్లో.
ఎప్పట్నించో ఈ ప్రహసనాన్నంతా చిద్విలాసంగా గమనిస్తూన్న నారదుడిపై పడ్డాయి యముడి కళ్ళు. ఒక్క అంగలో ఆయనవద్దకు వెళ్ళి ఈ గండం గట్టెక్కించమని వేడుకున్నాడు. నారదుడు ఒక్కసారి కళ్ళుమూసుకుని దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నవాడై ఇలా చెప్పాడు యముడికి. "యమధర్మరాజా! నీవు ఎంతో కాలంగా నరకంలో విధి నిర్వహణలో నిమగ్నమైపోయి భూలోకంలో ఏం జరుగుతోందో గమనించకుండా వచ్చావు. దాని ఫలితమే ఇది." నడుస్తూ వెళ్ళి మొదటి పాపి దగ్గర ఆగి చెప్పడం కొనసాగించాడు. "భూలోకంలో ఎండలు మండిపోతున్నాయి. భూతాపం పెరిగిపోయి సంవత్సరమంతా ఎండాకాలమే జరుగుతోందిప్పుడు భూలోకంలో. ఆ ఉక్కపోత, ఎండలతో పోలిస్తే నీ శిక్షలొక లెక్క కాదు. ఇకపోతే ఈ రెండవ పాపి. ఇతడిది గుంటూరు. గుంటూరు దేనికి ప్రసిధ్ధమో చెప్పు?" "మిరపకాయలకు" చెప్పాడు యముడు. "ఇంకా?" "గోంగూరకు, పొగాకుకు." "ఇవన్నీ కొన్ని శతాబ్దాల కిందట. ఇప్పుడు గుంటూరు దోమలకు ప్రసిద్ధి. ఒక్కసారి గుంటూరు వెళ్ళి చూసిరా అక్కడ దోమలు ఏపరిమాణంలో ఉంటాయో! పుట్టినదగ్గరినుంచీ ఏనుగులంతేసి దోమలతో కుట్టించుకుంటూ పెరిగినవాణ్ణి, దోమల నేపధ్య సంగీతం లేకుండా నిద్రపట్టని ఈమనిషిని నీ కత్తులూ బల్లేలూ ఏమీ చెయ్యలేవు”. "మరి ఈమూడోవాడి సంగతి?" అడిగాడు యముడు. "అది అర్థమవ్వాలంటే అలా ఒక్కసారి కిందకు చూడు" అన్నాడు నారదుడు. జనంతో కిక్కిరిసిపోయి నిండు గర్భిణిలా వెళుతోంది ఓ సిటీ బస్సు. ఒకపక్కకు బాగా ఒరిగిపోయి దాదాపు పడిపోయే స్థితిలో వెళుతున్న ఆ బస్సును చూసిన యముడు ఆశ్చర్యపోయాడు. "వారంతా ఆఫీసులకు, కాలేజీలకు వెళుతున్న నగర పౌరులు. ఇది కూడా చూడు" అన్నాడు నారదుడు, ఇక్కడ జనం రైల్లోకి ఎక్కడానికి తోసుకుంటున్నారు. రైలు పూర్తిగా నిండిపోయి మనుషులు వేళ్ళాడుతున్నా ఇంకా జనాలు ఎక్కడానికే ప్రయత్నిస్తున్నారు. "వీళ్ళంతా పండగలూ, పబ్బాలకు తమ తమ ఊళ్ళకు వెళుతున్న ప్రయాణీకులు. చివరిగా ఇటోసారి చూడు." అది ఒక ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం. క్యూ లైన్లలో ఇసకేస్తే రాలనంతగా కిటకిటలాడుతున్నారు భక్తులు. వీళ్ళు చాలనట్లు వేచియుండే గదుల్లో మరెంతో మంది తమ వంతుకోసం నిరీక్షిస్తున్నారు. "వీరంతా దైవదర్శనంకోసం వచ్చిన భక్తులు. ఇంకా తమ అభిమాన నటుడి చిత్రం చూడటానికో, ప్రతినెలా రేషను సరుకులు సంపాయించటానికో, పిల్లలకు బళ్ళో సీటు సంపాయించటానికో ఇలా ఏదో ఒకదానికై జనసమ్మర్దంలో ఈదేవాళ్ళే అందరూ" అన్నాడు నారదుడు.
"అయితే వీరిని శిక్షించగల పధ్ధతులేవీ లేనే లేవా స్వామీ?" అడిగాడు యముడు. "ఎందుకులేవూ, తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడూ ఉంటాడన్న సామెత ఊరికే పుట్టలేదు. ఒక్కసారి భూలోకం సంగతులన్నీ తెలుసుకుని కొంచెం కొత్తగా ఆలోచించావంటే ఇట్టే చిక్కుముడి వీడిపోతుంది. దీన్నే మన భూలోక వాసులు డబ్బా బయటి ఆలోచనగా(out of the box thinking) వ్యవహరిస్తుంటారు." అని ఉపదేశించి మాయమైపోయాడు నారదుడు. యముడికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. ఒక్కసారి కళ్ళుమూసుకుని దివ్యదృష్టితో చూశాడు. ఏంచేయాలో అర్థమవగానే ఆయన పెదవులమీద విజయగర్వంతో కూడిన మందహాసం ప్రత్యక్షమైంది. తిరిగి మొదటి పాపి వద్దకు వెళ్ళి శిక్షను మార్చి చెప్పసాగాడు "చిత్రగుప్తా, ఇతడిని కళ్ళూ చెవులూ మూసుకోనివ్వకుండా బంధించి, సకల కళా బీభత్సుడూ, ప్రేక్షక భయంకరుడూ అయిన సుమన్ బాబు సృజించిన కళాఖండాలన్నిటినీ ఒక్కోటీ లక్ష సార్లు చూపించండి" శిక్ష వివరించటం పూర్తి కాగానే గుమిగూడిన పాపులందరిలోనూ కలకలం బయలుదేరింది. శిక్ష విధించబడ్డవాడు దడుచుకుని విరుచుకు పడిపోయాడు. తన అంచనా తప్పనందుకు సంతోషిస్తూ యముడు రెండవ పాపి శిక్ష వివరించనారంభించాడు "ఇతడిని ఒక చర్చా కార్యక్రమానికి ప్రయోక్తగా నియమించి, ఆ చర్చకు భూలోకాన్నుంచి గంగాభవాని, నన్నపనేని, విజయశాంతి, రోజాలను ఆహ్వానించి, రచ్చ(చర్చ)ను నిరాటంకంగా పదివేల ఏళ్ళు జరిపించండి." రెండవవాడు లబలబలాడుతూ ప్రాధేయపడనారంభించాడు. పాపుల హాహాకారాలు మిన్నుముట్టాయి. మూడోవాడిని చూస్తూ కొనసాగించాడు యముడు. "ఇతడిని లక్ష్మీ టాక్ షో-లక్ష్మికి తెలుగు అధ్యాపకుడిగా నియమించండి". అదిమొదలు నరకలోకవాసులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. తిరుగుప్రయాణంలో నారదుడు మళ్ళీ నరకం మీదుగా వెళుతూ పూర్వంలాగే ఆక్రందనలతో, హాహాకారాలతో దద్దరిల్లుతూ ఉన్న ఆలోకాన్ని చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు.
Wednesday 3 February 2010
Wednesday 20 January 2010
అభికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి అభినవ్ కి శుభాకాంక్షలు. శతమానంభవతి. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. సకలవిద్యా ప్రాప్తిరస్తు.
- అమ్మ, నాన్న.
- అమ్మ, నాన్న.
Labels:
అభి పుట్టినరోజు
Thursday 10 December 2009
దిమ్మ తిరిగిందా మేడం?
అద్దిరా దెబ్బ !!!!
తొంభయ్యారు మంది పార్టీలకతీతంగా రాజీనామా.
తెలంగాణా సెంటిమెంటు ఉందని ఇన్నాళ్ళూ నమ్మిస్తూ వస్తున్న ఒఖ్ఖ నాయకుడూ చెయ్యలేని పని.
రాజకీయంగా దాదాపు చచ్చిన ఒక దిక్కుతోచని యంపీ నిజంగా(?) చస్తా అని బెదిరించినందుకే మైండు బ్లాకయ్యిన సోనియమ్మ ఇప్పుడేం చేస్తుందో చూడాలి.
సమైక్యాంధ్ర భావన ఎంత బలంగా ఉందో ఇప్పుడైనా ఢిల్లీ ధృతరాష్ట్రులకు తెలిసిరావాలి.
వే టు గో ఆంధ్రా నాయకులారా.
అసలు పోరాటం ఇప్పుడే మొదలయ్యింది.
తొంభయ్యారు మంది పార్టీలకతీతంగా రాజీనామా.
తెలంగాణా సెంటిమెంటు ఉందని ఇన్నాళ్ళూ నమ్మిస్తూ వస్తున్న ఒఖ్ఖ నాయకుడూ చెయ్యలేని పని.
రాజకీయంగా దాదాపు చచ్చిన ఒక దిక్కుతోచని యంపీ నిజంగా(?) చస్తా అని బెదిరించినందుకే మైండు బ్లాకయ్యిన సోనియమ్మ ఇప్పుడేం చేస్తుందో చూడాలి.
సమైక్యాంధ్ర భావన ఎంత బలంగా ఉందో ఇప్పుడైనా ఢిల్లీ ధృతరాష్ట్రులకు తెలిసిరావాలి.
వే టు గో ఆంధ్రా నాయకులారా.
అసలు పోరాటం ఇప్పుడే మొదలయ్యింది.
Wednesday 18 November 2009
రీయూనియన్ -3 (నా మొదటి సస్పెన్స్ కథ)
ఏం చెయ్యాలో ఇద్దరికీ పాలుబోలేదు. పోలీసులేమో మామాట నమ్మటంలేదు. ఇక అక్కడుండి చేసేదేమీలేనందువల్ల నెమ్మదిగా పోలీస్ స్టేషన్ బయటికొచ్చాం. మమ్మల్ని వెంబడిస్తున్నవాళ్ళ జాడలేదు. ఎటు వెళ్ళాలా అని ఆలోచించుకుంటూండగానే ఎదురుగా ఒక పోలీస్జీప్ వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఇన్స్పెక్టర్ని చూడగానే మాలో ఏమూలో ఆశ మళ్ళీ చిగురించింది. ఆయన దగ్గరికివెళ్ళి మాగోడంతా మళ్ళీ వినిపించాం. మనిషి శాంతస్వభావుడనుకుంటా, విసుక్కోకుండా అంతా విని "ఆ బంగళా ఎక్కడుందో చూపించగలరా?" అనడిగాడు. ఆ ఆలోచన మాకింతవరకూ తట్టనందుకు మమ్మల్ని మేమే తిట్టుకుని జీపెక్కి బంగళాకి దారితీశాం. ఆశ్చర్యకరంగా బంగళాలోగానీ తోటలో గానీ నరమానవుడెవ్వడూ లేడు సరిగదా అప్పటికి రెండు మూడు గంటల క్రితం వరకూ అక్కడొక పార్టీ జరిగిందన్న ఆనవాళ్ళు కూడా ఏమీ కనిపించటంలేదు. ఈ దెబ్బకి ఇన్స్పెక్టర్ కూడా మమ్మల్ని అనుమానిస్తాడేమో అని భయపడ్డాం కానీ ఎందుకో అతడు మా మాటలు నమ్మినట్లున్నాడు. ఒక్కసారి బంగళా అంతా కలియతిరిగి పరిశీలించి "ఈ బంగళాలో ఉన్నవాళ్ళ గురించి ఆరా తీయించి వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఈలోపు అవసరమైతే మీరు స్టేషనుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు ఊళ్ళోనే ఉండండి. మా కానిస్టేబుల్ ఒకరిని మీకు రక్షణగా ఉంచుతాను" అన్నాడు. మాకు గుండెలు జారిపోయాయి. దివాకరం మనిషో దెయ్యమో అర్థం కావటం లేదు ఒక పక్క. ఈ పరిస్థితుల్లో ఇంకొన్ని రోజులిక్కడ గడిపితే వాడే క్షణంలో అయినా వచ్చి మీద పడితే? ఈసారి తప్పించుకునే అవకాశం కూడా ఉండదేమో?? ఊహించటానికే భయం వేస్తోంది. దేవుడిపై భారం వేసి ఒప్పుకున్నాం.
మరో విచిత్రమైన విషయం, పల్లెలో సెల్ఫోన్ సిగ్నళ్ళు బాగానే వస్తున్నాయి. తోట బంగళాలో మాత్రమే లేవు. వెంటనే శేఖరానికి ఫోన్ చేశాను. అవతల ఫోన్ మోగుతోంది కానీ ఎవరూ ఎత్తటం లేదు. దాదాపు అరగంటసేపు ఆపకుండా ప్రయత్నించాను కానీ ఫలితం లేదు. విసిగిపోయి ఫోన్ పక్కన పడేశాను. ఫోన్ బహుశా వీడిదగ్గర లేదేమో? నాకు టెన్షన్ తో కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. విశ్వం "నేను ప్రయత్నిస్తా కాసేపు" అని ఫోన్ తీసుకుని డయల్ చేసి "ప్చ్! ఇప్పుడు ఎంగేజ్ వస్తోంది" అన్నాడు. అంటే అవతల ఫోన్ దగ్గర ఎవరో ఉన్నారన్నమాట ఇప్పుడు! ఆపకుండా విశ్వాన్ని ప్రయత్నిస్తూనే ఉండమన్నాను. మరో అయిదు నిమిషాలకు మళ్ళీ ఫోన్ మోగింది అవతల. ఈసారి వెంటనే ఎత్తారెవరో, శేఖరం గొంతు కాదది. విశ్వం దగ్గర్నించి ఫోన్ నేను తీసుకున్నాను. వెనకాలంతా చాలా రణగొణధ్వనిగా ఉంది. ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. శేఖరం గురించి అడిగాను. అవతలనుంచి చెప్పిన విషయం నన్ను నిలువునా కృంగి పోయేట్లు చేసింది. శేఖరం ప్రయాణిస్తున్న రైలుకి ఘోర ప్రమాదం జరిగిందట నిన్న రాత్రి. చాలామంది చనిపోయారట. ఈ సెల్ఫోన్ కూడా చనిపోయిన శేఖరం జేబులో ఆగకుండా మోగుతుండటం చూసి ఎవరో సహాయబృందం వాళ్ళు తీసి మాట్లాడారు. ప్రమాదం ఎక్కడ జరిగిందీ, అక్కడికెలా చేరుకోవాలి మొదలైన వివరాలు తెలుసుకుని భారంగా ఫోన్ పెట్టేశా. విషయం తెలిసి విశ్వంకూడా భోరుమన్నాడు.
ఇంతలో మళ్ళీ నాఫోన్ మోగింది. ఎత్తగానే అవతలినుంచి చిన్న నవ్వు వినిపించింది. "దివాకరం?!" అన్నాను నిలువెల్లా కంపించి పోతూ. జవాబుగా అవతలి వ్యక్తి మళ్ళీ నవ్వి "ఫోన్ ఒక్కసారి లౌడ్ స్పీకర్ లో పెట్టండి భాస్కరం గారూ, నేను మాట్లాడేది విశ్వంగారికి కూడా వినిపించాలి" అన్నాడు. ఈ కొత్త పిలుపుకు ఆశ్చర్య పోతూ చెప్పింది చేశా. వెంటనే అతడు మాట్లాడటం మొదలు పెట్టాడు. "భాస్కరం గారూ, విశ్వం గారూ, మీకిప్పటి వరకూ కలిగించిన అసౌకర్యానికి నన్ను క్షమించండి. నేను మీరనుకుంటున్నట్టు దివాకరాన్ని కాదు. దివాకరం ఆత్మని అంతకంటే కాదు. నాపేరు సురేంద్ర. దివాకరం నా తండ్రి. నా పగ కేవలం శేఖరం మీద. మీతో నాకెటువంటి శతృత్వమూ లేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు శేఖరం ప్రమాదంలో మరణించాడన్న వార్త ఇప్పుడే నాకూ తెలిసింది. ఇక మీకు నానుంచి ఎటువంటి ఇబ్బందీ ఎదురవదు. మరొక్కసారి నాతరఫునుంచి జరిగిందానికి క్షమాపణలు." ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ విశ్వం అడిగాడు "శేఖరంపై ఎందుకు నీకంత కోపం?"
"కోపమా? హు! కోపం కాదు, పగ, కసి!! మీ ఇద్దరికీ తెలియదు వాడి కారణంగా మా నాన్న బతికుండగా ఎంత క్షోభ అనుభవించాడో? మానాన్న వీడిని ప్రాణ స్నేహితుడని నమ్మితే ఆనమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడిచాడు. ఏ స్నేహితుడూ మరో స్నేహితుడి పట్ల చెయ్యకూడని ద్రోహం చేశాడు. శేఖరం అమెరికా రావడానికి ముందు దగ్గర్లోని టౌనులో ఏదో వ్యాపారం చేసేవాడు. ప్రతీ వారం పల్లెకు వచ్చి నాన్నతో గడిపి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మాఇంట్లోనే బస. ఇలా మొదలైన రాకపోకలు నాన్న ఉన్నప్పుడే కాదు లేనప్పుడూ కొనసాగేవి. ఎలా జరిగిందో తెలియదు, మా అమ్మతో వాడి సాన్నిహిత్యం రోజు రోజుకూ పెరగసాగింది. నేను హాస్టల్లో ఉండి చదువుకోవటం, నాన్న తరచుగా ఊరువెళ్ళి రెండుమూడు రోజులదాకా రాకపోవటం కూడా వాళ్ళకు మంచి అవకాశాన్నిచ్చింది. ఈవిధంగా ఎన్నాళ్ళు కొనసాగేదోగానీ శేఖరం అమెరికా ప్రయత్నాలు అనుకున్నదానికంటే త్వరగా ఫలించటం వల్ల దీనికి తెర పడింది. మా నాన్నకు అమ్మంటే ప్రాణం. పెళ్ళి చేసుకున్న నాటినుంచీ ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఏనాడూ పల్లెత్తు మాటని ఎరగడు. అలాంటి నాన్నకు ద్రోహం చేసిన ఉసురు అమ్మకు తగలనే తగిలింది. ఆవిడకు కాన్సర్ అని మరెంతో కాలం బ్రతకదనీ తేల్చేశారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో కూడా ఆశ చావని నాన్న అమ్మని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాడు. ఆయన తిరగని ఊరు లేదు, కలవని డాక్టర్ లేడు. ఎంత చేసినా ఫలితం దక్కలేదు. చనిపోయే ముందు చివరి క్షణాలలో అమ్మ నాన్నకు తను చేసిన ద్రోహం గురించి కుమిలిపోయింది. చేసిన పాపం చెబితే పోతుందనుకుందో ఏమో, జరిగినదంతా నాన్నకు చెప్పి క్షమించమని వేడుకుని కన్ను మూసింది. కానీ నాన్నకు ఆరోజునుంచే మొదలైంది అసలైన నరకం. ఎంతగానో ప్రేమించిన భార్య, ప్రాణ స్నేహితుడు కలిసి తనని ఎంతగా మోసం చేశారో తలచుకుని తనలో తనే కుమిలిపోయేవాడు.
కానీ ఎంత బాధ పడుతున్నా ఏనాడూ బయటపడేవాడు కాదు. ప్రతీ వారం హాస్టల్లో ఉంటున్న నాదగ్గరకు వచ్చి నన్ను సినిమాలకూ షికార్లకూ తిప్పేవాడు. అసలు నాన్న తన మనసులో ఇంత బాధను దాచుకున్నాడని నాకెప్పటికీ తెలిసేది కాదు, ఆయన డైరీలు నాకంట పడకపోయి ఉంటే. నాన్న చనిపోయిన తరువాత ఆయన గుర్తుగా కొన్ని వస్తువులు మాత్రం ఉంచుకుని మిగతా ఆస్తులన్నీ అమ్మేసి శాశ్వతంగా ఈఊరునుంచి వెళ్ళిపోదామనుకున్నాను. అలా సర్దుతుంటే కనిపించాయి ఇవి. చదివాక నా రక్తం మరిగిపోయింది. ఎలాగైనా సరే శేఖరం అంతకంతా అనుభవించేట్లు చేసి మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నా. మా అమ్మ ఎన్నటికీ ఈ విషయం చెప్పదని శేఖరం అనుకుని వుంటాడని తెలుసు. తెలివిగా వాడిని ఇక్కడికి రప్పించి అంతం చేద్దామని పథకం వేశాను. ఎంతో ప్రయత్నం మీద భాస్కరంగారి ఫోన్ నంబరు సంపాదించా. నేను మా నాన్నను చాలావరకూ పోలి ఉంటాను కాబట్టి మిమ్మల్ని కాస్తంత మేకప్ తో నేనే దివాకరం అని చెప్పి సులువుగా మోసగించగలిగాను. మీరూ చాలాకాలం తర్వాత నాన్నను కలవటంవల్ల గుర్తించలేకపోయారు. మిమ్మల్ని నావైపు తిప్పుకోవటానికి వెంకట లక్ష్మి ఉత్తరం గురించి చీకట్లో బాణం వేశాను. శేఖరాన్ని హెచ్చరించకుండా ఉండటంకోసం మీ సెల్ ఫోన్లు పనిచెయ్యకుండా చేశాను. ఇదంతా తర్వాత బయటపడక తప్పదనీ నేను ఖచ్చితంగా జైలుపాలవుతాననీ తెలుసు. అన్నిటికీ తెగించే ఇదంతా చేశాను. కానీ నేనొకటనుకుంటే దేవుడొకటనుకున్నాడు. ఇంతాచేసి వాడిని నాచేతులతో చంపలేకపోయానన్నదే నాక్కాస్త బాధగా ఉంది. ఏమయినా మానాన్న అత్మకి ఈవిధంగా అయినా కాస్త శాంతి చేకూరి ఉంటుంది. ఆ సంతృప్తితోనే సెలవు తీసుకుంటున్నాను." ఫోన్ పెట్టేసిన చప్పుడు. మా ఇద్దరి మనసులూ భారమయ్యాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని వచ్చి ఇద్దరు స్నేహితులను గురించి నమ్మలేని విషయాలు వినాల్సి వచ్చింది. కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు కదిలాయి మా పాదాలు.
(అయిపోయింది)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
మరో విచిత్రమైన విషయం, పల్లెలో సెల్ఫోన్ సిగ్నళ్ళు బాగానే వస్తున్నాయి. తోట బంగళాలో మాత్రమే లేవు. వెంటనే శేఖరానికి ఫోన్ చేశాను. అవతల ఫోన్ మోగుతోంది కానీ ఎవరూ ఎత్తటం లేదు. దాదాపు అరగంటసేపు ఆపకుండా ప్రయత్నించాను కానీ ఫలితం లేదు. విసిగిపోయి ఫోన్ పక్కన పడేశాను. ఫోన్ బహుశా వీడిదగ్గర లేదేమో? నాకు టెన్షన్ తో కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. విశ్వం "నేను ప్రయత్నిస్తా కాసేపు" అని ఫోన్ తీసుకుని డయల్ చేసి "ప్చ్! ఇప్పుడు ఎంగేజ్ వస్తోంది" అన్నాడు. అంటే అవతల ఫోన్ దగ్గర ఎవరో ఉన్నారన్నమాట ఇప్పుడు! ఆపకుండా విశ్వాన్ని ప్రయత్నిస్తూనే ఉండమన్నాను. మరో అయిదు నిమిషాలకు మళ్ళీ ఫోన్ మోగింది అవతల. ఈసారి వెంటనే ఎత్తారెవరో, శేఖరం గొంతు కాదది. విశ్వం దగ్గర్నించి ఫోన్ నేను తీసుకున్నాను. వెనకాలంతా చాలా రణగొణధ్వనిగా ఉంది. ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. శేఖరం గురించి అడిగాను. అవతలనుంచి చెప్పిన విషయం నన్ను నిలువునా కృంగి పోయేట్లు చేసింది. శేఖరం ప్రయాణిస్తున్న రైలుకి ఘోర ప్రమాదం జరిగిందట నిన్న రాత్రి. చాలామంది చనిపోయారట. ఈ సెల్ఫోన్ కూడా చనిపోయిన శేఖరం జేబులో ఆగకుండా మోగుతుండటం చూసి ఎవరో సహాయబృందం వాళ్ళు తీసి మాట్లాడారు. ప్రమాదం ఎక్కడ జరిగిందీ, అక్కడికెలా చేరుకోవాలి మొదలైన వివరాలు తెలుసుకుని భారంగా ఫోన్ పెట్టేశా. విషయం తెలిసి విశ్వంకూడా భోరుమన్నాడు.
ఇంతలో మళ్ళీ నాఫోన్ మోగింది. ఎత్తగానే అవతలినుంచి చిన్న నవ్వు వినిపించింది. "దివాకరం?!" అన్నాను నిలువెల్లా కంపించి పోతూ. జవాబుగా అవతలి వ్యక్తి మళ్ళీ నవ్వి "ఫోన్ ఒక్కసారి లౌడ్ స్పీకర్ లో పెట్టండి భాస్కరం గారూ, నేను మాట్లాడేది విశ్వంగారికి కూడా వినిపించాలి" అన్నాడు. ఈ కొత్త పిలుపుకు ఆశ్చర్య పోతూ చెప్పింది చేశా. వెంటనే అతడు మాట్లాడటం మొదలు పెట్టాడు. "భాస్కరం గారూ, విశ్వం గారూ, మీకిప్పటి వరకూ కలిగించిన అసౌకర్యానికి నన్ను క్షమించండి. నేను మీరనుకుంటున్నట్టు దివాకరాన్ని కాదు. దివాకరం ఆత్మని అంతకంటే కాదు. నాపేరు సురేంద్ర. దివాకరం నా తండ్రి. నా పగ కేవలం శేఖరం మీద. మీతో నాకెటువంటి శతృత్వమూ లేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు శేఖరం ప్రమాదంలో మరణించాడన్న వార్త ఇప్పుడే నాకూ తెలిసింది. ఇక మీకు నానుంచి ఎటువంటి ఇబ్బందీ ఎదురవదు. మరొక్కసారి నాతరఫునుంచి జరిగిందానికి క్షమాపణలు." ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ విశ్వం అడిగాడు "శేఖరంపై ఎందుకు నీకంత కోపం?"
"కోపమా? హు! కోపం కాదు, పగ, కసి!! మీ ఇద్దరికీ తెలియదు వాడి కారణంగా మా నాన్న బతికుండగా ఎంత క్షోభ అనుభవించాడో? మానాన్న వీడిని ప్రాణ స్నేహితుడని నమ్మితే ఆనమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడిచాడు. ఏ స్నేహితుడూ మరో స్నేహితుడి పట్ల చెయ్యకూడని ద్రోహం చేశాడు. శేఖరం అమెరికా రావడానికి ముందు దగ్గర్లోని టౌనులో ఏదో వ్యాపారం చేసేవాడు. ప్రతీ వారం పల్లెకు వచ్చి నాన్నతో గడిపి వెళ్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మాఇంట్లోనే బస. ఇలా మొదలైన రాకపోకలు నాన్న ఉన్నప్పుడే కాదు లేనప్పుడూ కొనసాగేవి. ఎలా జరిగిందో తెలియదు, మా అమ్మతో వాడి సాన్నిహిత్యం రోజు రోజుకూ పెరగసాగింది. నేను హాస్టల్లో ఉండి చదువుకోవటం, నాన్న తరచుగా ఊరువెళ్ళి రెండుమూడు రోజులదాకా రాకపోవటం కూడా వాళ్ళకు మంచి అవకాశాన్నిచ్చింది. ఈవిధంగా ఎన్నాళ్ళు కొనసాగేదోగానీ శేఖరం అమెరికా ప్రయత్నాలు అనుకున్నదానికంటే త్వరగా ఫలించటం వల్ల దీనికి తెర పడింది. మా నాన్నకు అమ్మంటే ప్రాణం. పెళ్ళి చేసుకున్న నాటినుంచీ ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ఏనాడూ పల్లెత్తు మాటని ఎరగడు. అలాంటి నాన్నకు ద్రోహం చేసిన ఉసురు అమ్మకు తగలనే తగిలింది. ఆవిడకు కాన్సర్ అని మరెంతో కాలం బ్రతకదనీ తేల్చేశారు డాక్టర్లు. ఆ పరిస్థితిలో కూడా ఆశ చావని నాన్న అమ్మని బ్రతికించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాడు. ఆయన తిరగని ఊరు లేదు, కలవని డాక్టర్ లేడు. ఎంత చేసినా ఫలితం దక్కలేదు. చనిపోయే ముందు చివరి క్షణాలలో అమ్మ నాన్నకు తను చేసిన ద్రోహం గురించి కుమిలిపోయింది. చేసిన పాపం చెబితే పోతుందనుకుందో ఏమో, జరిగినదంతా నాన్నకు చెప్పి క్షమించమని వేడుకుని కన్ను మూసింది. కానీ నాన్నకు ఆరోజునుంచే మొదలైంది అసలైన నరకం. ఎంతగానో ప్రేమించిన భార్య, ప్రాణ స్నేహితుడు కలిసి తనని ఎంతగా మోసం చేశారో తలచుకుని తనలో తనే కుమిలిపోయేవాడు.
కానీ ఎంత బాధ పడుతున్నా ఏనాడూ బయటపడేవాడు కాదు. ప్రతీ వారం హాస్టల్లో ఉంటున్న నాదగ్గరకు వచ్చి నన్ను సినిమాలకూ షికార్లకూ తిప్పేవాడు. అసలు నాన్న తన మనసులో ఇంత బాధను దాచుకున్నాడని నాకెప్పటికీ తెలిసేది కాదు, ఆయన డైరీలు నాకంట పడకపోయి ఉంటే. నాన్న చనిపోయిన తరువాత ఆయన గుర్తుగా కొన్ని వస్తువులు మాత్రం ఉంచుకుని మిగతా ఆస్తులన్నీ అమ్మేసి శాశ్వతంగా ఈఊరునుంచి వెళ్ళిపోదామనుకున్నాను. అలా సర్దుతుంటే కనిపించాయి ఇవి. చదివాక నా రక్తం మరిగిపోయింది. ఎలాగైనా సరే శేఖరం అంతకంతా అనుభవించేట్లు చేసి మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నా. మా అమ్మ ఎన్నటికీ ఈ విషయం చెప్పదని శేఖరం అనుకుని వుంటాడని తెలుసు. తెలివిగా వాడిని ఇక్కడికి రప్పించి అంతం చేద్దామని పథకం వేశాను. ఎంతో ప్రయత్నం మీద భాస్కరంగారి ఫోన్ నంబరు సంపాదించా. నేను మా నాన్నను చాలావరకూ పోలి ఉంటాను కాబట్టి మిమ్మల్ని కాస్తంత మేకప్ తో నేనే దివాకరం అని చెప్పి సులువుగా మోసగించగలిగాను. మీరూ చాలాకాలం తర్వాత నాన్నను కలవటంవల్ల గుర్తించలేకపోయారు. మిమ్మల్ని నావైపు తిప్పుకోవటానికి వెంకట లక్ష్మి ఉత్తరం గురించి చీకట్లో బాణం వేశాను. శేఖరాన్ని హెచ్చరించకుండా ఉండటంకోసం మీ సెల్ ఫోన్లు పనిచెయ్యకుండా చేశాను. ఇదంతా తర్వాత బయటపడక తప్పదనీ నేను ఖచ్చితంగా జైలుపాలవుతాననీ తెలుసు. అన్నిటికీ తెగించే ఇదంతా చేశాను. కానీ నేనొకటనుకుంటే దేవుడొకటనుకున్నాడు. ఇంతాచేసి వాడిని నాచేతులతో చంపలేకపోయానన్నదే నాక్కాస్త బాధగా ఉంది. ఏమయినా మానాన్న అత్మకి ఈవిధంగా అయినా కాస్త శాంతి చేకూరి ఉంటుంది. ఆ సంతృప్తితోనే సెలవు తీసుకుంటున్నాను." ఫోన్ పెట్టేసిన చప్పుడు. మా ఇద్దరి మనసులూ భారమయ్యాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని వచ్చి ఇద్దరు స్నేహితులను గురించి నమ్మలేని విషయాలు వినాల్సి వచ్చింది. కంప్లైంట్ వెనక్కి తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వైపు కదిలాయి మా పాదాలు.
(అయిపోయింది)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
Labels:
కథలు
Tuesday 17 November 2009
రీయూనియన్ -2 (నా మొదటి సస్పెన్స్ కథ)
ఇది తాగుబోతు వాగుడే అని నిశ్చయంగా అర్థమయ్యింది మా ఇద్దరికీ. పడుకుందామని లేచి వచ్చేస్తున్నాం. "నాది తాగుబోతు మాటలు అనుకుంటున్నారు కదూ" వెనకనుంచి అంటున్నాడు దివాకరం. "నిస్సందేహంగా" అన్నాడు విశ్వం వెనక్కి తిరగకుండానే. "ఏం చేసి మిమ్మల్ని నమ్మించాలో చెప్పండి మరి", దివాకరం ప్రేలాపనకు అంతులేకుండా పోతోంది. "ఏం చెయ్యవద్దుగానీ వెళ్ళి పడుకో రేపు మాట్లాడదాం" అన్నా నేను. "పోనీ వెంకట లక్ష్మి ఉత్తరం గురించి చెబితే నమ్ముతారా" అరిచాడు దివాకరం. మా ఇద్దరి ముఖాలూ కత్తి వేటుకు నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయాయి. "ఆ విషయం ఇప్పుడెందుకురా" అన్నాడు విశ్వం కంగారుగా. వెంకట లక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు దివాకరం తల్లిదండ్రులు. తరచూ దివాకరాన్ని కలుసుకోవటానికి అక్కడికొస్తూండటం వల్ల విశ్వంగాడి కన్ను ఆ అమ్మాయి మీద పడింది. పాపం ఆ అమ్మాయి వీడివంక కన్నెత్తి కూడా చూసేది కాదు. అయినా సరే నన్ను వెంటేసుకుని ఆ అమ్మాయి వెళ్ళినచోటల్లా నీడలా వెంబడిస్తూ ఉండేవాడు. ఇంతలో ఆ అమ్మాయికి ఏదో పెళ్ళి సంబంధం వచ్చింది. తనని పట్టించుకోలేదనే కసితో ఆ పిల్ల మీద ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేసి ఆ సంబంధం చెడిపోయేట్లు చేశాడు విశ్వం, నా సహాయంతో. అవమానం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది వెంకట లక్ష్మి. చనిపోతూ ఉత్తరమేదో రాసి అందులో తన చావుకు కారణంగా మా ఇద్దరి పేర్లు రాసిందట. సమయానికి ఇంట్లో ఎవరూ లేక పోవటం, ఆమె శవాన్ని మొదట దివాకరమే చూడటం వల్ల ఆ ఉత్తరం మూడోకంటికి తెలియకుండా మాయం చెయ్యబడింది. ఆ ఉత్తరం సంగతే ఇప్పుడు దివాకరం ప్రస్తావిస్తున్నది. "ఆ ఉత్తరం మాయం చేశానని చెప్పావు కదరా" అడిగాను నేను, నా గొంతు వణకడం నాకే స్పష్టంగా తెలుస్తోంది.
"లేదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని భద్రంగా ఉంచా" చిన్నగా నవ్వాడు దివాకరం. "వెంకట లక్ష్మి అన్నలకు ఈ ఊళ్ళో ఎంత పలుకుబడి ఉందో మీకు తెలుసుగా" బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాడు. ఆ మాట నిజమే, ఆ దారుణానికి మేమే కారణమని తెలిస్తే ఇన్నేళ్ళ తరువాతైనా సరే నరికి పోగులు పెట్టకుండా వదలరు. గొంతు పిడచకట్టుకుపోతున్నట్టనిపించింది. విశ్వం వంక చూశా, వాడూ గుటకలు మింగుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. "కానీ… శేఖరాన్ని… ఎందుకు…?" అతికష్టం మీద అనగలిగా శక్తి కూడతీసుకుని. "అది నీకనవసరం, రెండ్రోజుల తరువాత వచ్చే వాడు ప్రాణాలతో ఈ ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు" కొంతసేపటి క్రితం వరకూ ఎంతో సౌమ్యంగా కనిపించిన దివాకరం ముఖంలో ఇప్పుడు క్రౌర్యం ఉట్టిపడుతోంది. "సరే, ఆలోచించుకోవటానికి మాక్కాస్త సమయం కావాలి" అన్నాడు విశ్వం. "ఆలోచించుకో, కానీ శేఖరాన్ని ఎలా చంపాలా అని మాత్రమే. ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవటానికి మటుకు నీకు ఛాయిస్ లేదు" వెటకారం ధ్వనించింది దివాకరం మాటల్లో.
తడబడుతున్న అడుగులతో మా గదుల్లోకి వచ్చి పడుకున్నామే కానీ నిద్రలు పట్టలేదు ఇద్దరికీ. అసలు శేఖరాన్ని చంపాల్సిన అవసరమేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. పిల్లిలా బయటకు వచ్చి చూశాను. తప్పించుకుపోవటానికి వీల్లేకుండా తోట చుట్టూ గట్టి బందోబస్తే పెట్టాడు దివాకరం. గంట క్రితం వరకూ మా రక్షణ కోసం చేసినట్లనిపించిన ఏర్పాట్లు ఇప్పుడు కాపలా ఏర్పాట్లనిపించటంలో ఆశ్చర్యం లేదు. దివాకరం గాఢ నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా వెళ్ళి విశ్వాన్ని లేపా. వాడికీ విషయం ఏమీ అంతుబట్టటంలేదు. ఎన్నో తర్క వితర్కాల తరువాత తెల్లవారేలోపు ఎలాగోలా బయటపడి దొరికిన బస్సో మరోటో పట్టుకుని దగ్గర్లోని టౌనుకు చేరి అక్కడినుంచి హైదరాబాద్ చేరాలని, ఈలోపు శేఖరానికి కూడా ఫోన్ చేసి పల్లెకు తిరిగి రావద్దని చెప్పాలనీ నిర్ణయించుకున్నాం. రాత్రి జరిగినదానికి మావద్ద ఆధారాలేమీ లేనందువల్ల పోలీసుల దగ్గరికి వెళ్ళి నిరూపించగలిగేది ఏమీ ఉండదని మాకు తెలుసు. అదీగాక అటు తిరిగి ఇటు తిరిగి విషయం వెంకట లక్ష్మి దగ్గరకు వచ్చిందంటే ఇరుక్కునేది మేమే.
బయట కాపలా వాళ్ళ అలికిడి కూడా ఇప్పుడంతగా వినిపించడం లేదు. బహుశా వాళ్ళూ నిద్రలోకి జారుకుని వుంటారు. తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి తరుణం ఉండబోదని అనిపించింది. అలికిడి చెయ్యకుండా వెనుక ద్వారం గుండా బయటికి వచ్చాం. కనిపించే ప్రహరీ గోడ ఎక్కి దూకి తోట దాటితే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడినుంచి లారీయో బస్సో పట్టుకోవచ్చు. ఆలోచిస్తూ నడుస్తూనే చీకట్లో చూసుకోక దేన్నో తన్నినట్లున్నాను, పెద్దగా చప్పుడు కావటం మామీద రెండు టార్చిలైట్లు పడటం క్షణాల్లో జరిగిపోయాయి. విశ్వాన్ని హెచ్చరించి పరుగందుకున్నాను. అలవాటులేకపోవటం వల్ల ఇద్దరమూ పరిగెత్తలేకపోతున్నాము. వెనక ముగ్గురు నలుగురు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మమ్మల్ని చుట్టుముట్టటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎలాగోలా తోట దాటి మెయిన్ రోడ్ చేరుకున్నాం. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు వదలక వెంటాడుతూనే వున్నారు. త్వరలో ఏదో ఒక సురక్షితమైన చోటు చేరుకోకపోతే వాళ్ళకు చిక్కటం ఖాయమని తోచింది నాకు. చూడబోతే ఒక్క చిన్న వాహనమూ వస్తున్నట్టులేదు. పరిగెత్తీ పరిగెత్తీ విశ్వం విపరీతంగా రొప్పుతున్నాడు. నాదీ అదే పరిస్థితి. ఇక దాదాపు శక్తి ఉడిగిపోయే సమయానికి దేవుడు పంపినట్లుగా అల్లంత దూరంలో దర్శనమిచ్చింది పోలీస్ స్టేషన్. మిగిలిన శక్తినంతా కూడదీసుకుని నాలుగంగల్లో వెళ్ళి పడ్డాం.
ఒక కానిస్టేబులు కునికిపాట్లు పడుతూ కనిపించాడు. జరిగినదంతా గబగబా వివరించాం. కానిస్టేబుల్ ఒక్కసారి గట్టిగా ఆవులించి, మత్తు వదలని కళ్ళని బలవంతంగా తెరిచి చూస్తూ అడిగాడు, "ఇంతకీ ఎవరు మిమ్మల్ని వెంటాడుతోంది"? దివాకరం మనుషులని చెప్పాను. సమాధానంగా ఒక వెకిలి నవ్వు నవ్వి, "మీ దగ్గర గుప్పున కంపు వచ్చినప్పుడే అనుకున్నాను, ఇలాంటిదే ఏదో అయ్యివుంటుందని. మా సమయం వృధా చెయ్యకుండా వెళ్ళిరండి" అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. మా ఇద్దరికీ అరికాలిమంట నషాళానికంటింది. ఒక పక్క ప్రాణాల మీదికి వచ్చిందని మొత్తుకుంటూంటే ఏమిటి వీడి మాటలు? "మా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోరేం" అనరిచా ఇంగ్లీషులో. బదులుగా అతడూ అదే స్వరంలో జవాబిచ్చాడు "తాగుబోతు నాయాళ్ళల్లారా, రెండు నెల్ల క్రితం చచ్చిపోయిన దివాకరం మిమ్మల్ని చంపుతానని వెంట పడుతున్నాడా. అది విని నమ్మటానికి మేమేమయినా మీలా మందుకొట్టి ఉన్నామనుకుంటున్నార్రా" ఇంకా ఏదేదో అంటున్నాడు కానీ ఏమీ వినిపించటంలేదు. మా ఇద్దరి పక్కనా రెండు పిడుగులు పడ్డట్టు అనిపించింది. దివాకరం చనిపోయి రెండు నెలలు అవుతోందా? మరి నిన్నటినుంచీ మాతో ఉన్నదెవరు??
(చివరి భాగం రేపు)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
"లేదు, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని భద్రంగా ఉంచా" చిన్నగా నవ్వాడు దివాకరం. "వెంకట లక్ష్మి అన్నలకు ఈ ఊళ్ళో ఎంత పలుకుబడి ఉందో మీకు తెలుసుగా" బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాడు. ఆ మాట నిజమే, ఆ దారుణానికి మేమే కారణమని తెలిస్తే ఇన్నేళ్ళ తరువాతైనా సరే నరికి పోగులు పెట్టకుండా వదలరు. గొంతు పిడచకట్టుకుపోతున్నట్టనిపించింది. విశ్వం వంక చూశా, వాడూ గుటకలు మింగుతూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. "కానీ… శేఖరాన్ని… ఎందుకు…?" అతికష్టం మీద అనగలిగా శక్తి కూడతీసుకుని. "అది నీకనవసరం, రెండ్రోజుల తరువాత వచ్చే వాడు ప్రాణాలతో ఈ ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు" కొంతసేపటి క్రితం వరకూ ఎంతో సౌమ్యంగా కనిపించిన దివాకరం ముఖంలో ఇప్పుడు క్రౌర్యం ఉట్టిపడుతోంది. "సరే, ఆలోచించుకోవటానికి మాక్కాస్త సమయం కావాలి" అన్నాడు విశ్వం. "ఆలోచించుకో, కానీ శేఖరాన్ని ఎలా చంపాలా అని మాత్రమే. ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవటానికి మటుకు నీకు ఛాయిస్ లేదు" వెటకారం ధ్వనించింది దివాకరం మాటల్లో.
తడబడుతున్న అడుగులతో మా గదుల్లోకి వచ్చి పడుకున్నామే కానీ నిద్రలు పట్టలేదు ఇద్దరికీ. అసలు శేఖరాన్ని చంపాల్సిన అవసరమేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. పిల్లిలా బయటకు వచ్చి చూశాను. తప్పించుకుపోవటానికి వీల్లేకుండా తోట చుట్టూ గట్టి బందోబస్తే పెట్టాడు దివాకరం. గంట క్రితం వరకూ మా రక్షణ కోసం చేసినట్లనిపించిన ఏర్పాట్లు ఇప్పుడు కాపలా ఏర్పాట్లనిపించటంలో ఆశ్చర్యం లేదు. దివాకరం గాఢ నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా వెళ్ళి విశ్వాన్ని లేపా. వాడికీ విషయం ఏమీ అంతుబట్టటంలేదు. ఎన్నో తర్క వితర్కాల తరువాత తెల్లవారేలోపు ఎలాగోలా బయటపడి దొరికిన బస్సో మరోటో పట్టుకుని దగ్గర్లోని టౌనుకు చేరి అక్కడినుంచి హైదరాబాద్ చేరాలని, ఈలోపు శేఖరానికి కూడా ఫోన్ చేసి పల్లెకు తిరిగి రావద్దని చెప్పాలనీ నిర్ణయించుకున్నాం. రాత్రి జరిగినదానికి మావద్ద ఆధారాలేమీ లేనందువల్ల పోలీసుల దగ్గరికి వెళ్ళి నిరూపించగలిగేది ఏమీ ఉండదని మాకు తెలుసు. అదీగాక అటు తిరిగి ఇటు తిరిగి విషయం వెంకట లక్ష్మి దగ్గరకు వచ్చిందంటే ఇరుక్కునేది మేమే.
బయట కాపలా వాళ్ళ అలికిడి కూడా ఇప్పుడంతగా వినిపించడం లేదు. బహుశా వాళ్ళూ నిద్రలోకి జారుకుని వుంటారు. తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి తరుణం ఉండబోదని అనిపించింది. అలికిడి చెయ్యకుండా వెనుక ద్వారం గుండా బయటికి వచ్చాం. కనిపించే ప్రహరీ గోడ ఎక్కి దూకి తోట దాటితే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అక్కడినుంచి లారీయో బస్సో పట్టుకోవచ్చు. ఆలోచిస్తూ నడుస్తూనే చీకట్లో చూసుకోక దేన్నో తన్నినట్లున్నాను, పెద్దగా చప్పుడు కావటం మామీద రెండు టార్చిలైట్లు పడటం క్షణాల్లో జరిగిపోయాయి. విశ్వాన్ని హెచ్చరించి పరుగందుకున్నాను. అలవాటులేకపోవటం వల్ల ఇద్దరమూ పరిగెత్తలేకపోతున్నాము. వెనక ముగ్గురు నలుగురు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మమ్మల్ని చుట్టుముట్టటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఎలాగోలా తోట దాటి మెయిన్ రోడ్ చేరుకున్నాం. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు వదలక వెంటాడుతూనే వున్నారు. త్వరలో ఏదో ఒక సురక్షితమైన చోటు చేరుకోకపోతే వాళ్ళకు చిక్కటం ఖాయమని తోచింది నాకు. చూడబోతే ఒక్క చిన్న వాహనమూ వస్తున్నట్టులేదు. పరిగెత్తీ పరిగెత్తీ విశ్వం విపరీతంగా రొప్పుతున్నాడు. నాదీ అదే పరిస్థితి. ఇక దాదాపు శక్తి ఉడిగిపోయే సమయానికి దేవుడు పంపినట్లుగా అల్లంత దూరంలో దర్శనమిచ్చింది పోలీస్ స్టేషన్. మిగిలిన శక్తినంతా కూడదీసుకుని నాలుగంగల్లో వెళ్ళి పడ్డాం.
ఒక కానిస్టేబులు కునికిపాట్లు పడుతూ కనిపించాడు. జరిగినదంతా గబగబా వివరించాం. కానిస్టేబుల్ ఒక్కసారి గట్టిగా ఆవులించి, మత్తు వదలని కళ్ళని బలవంతంగా తెరిచి చూస్తూ అడిగాడు, "ఇంతకీ ఎవరు మిమ్మల్ని వెంటాడుతోంది"? దివాకరం మనుషులని చెప్పాను. సమాధానంగా ఒక వెకిలి నవ్వు నవ్వి, "మీ దగ్గర గుప్పున కంపు వచ్చినప్పుడే అనుకున్నాను, ఇలాంటిదే ఏదో అయ్యివుంటుందని. మా సమయం వృధా చెయ్యకుండా వెళ్ళిరండి" అన్నాడు హెచ్చరిస్తున్నట్టు. మా ఇద్దరికీ అరికాలిమంట నషాళానికంటింది. ఒక పక్క ప్రాణాల మీదికి వచ్చిందని మొత్తుకుంటూంటే ఏమిటి వీడి మాటలు? "మా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోరేం" అనరిచా ఇంగ్లీషులో. బదులుగా అతడూ అదే స్వరంలో జవాబిచ్చాడు "తాగుబోతు నాయాళ్ళల్లారా, రెండు నెల్ల క్రితం చచ్చిపోయిన దివాకరం మిమ్మల్ని చంపుతానని వెంట పడుతున్నాడా. అది విని నమ్మటానికి మేమేమయినా మీలా మందుకొట్టి ఉన్నామనుకుంటున్నార్రా" ఇంకా ఏదేదో అంటున్నాడు కానీ ఏమీ వినిపించటంలేదు. మా ఇద్దరి పక్కనా రెండు పిడుగులు పడ్డట్టు అనిపించింది. దివాకరం చనిపోయి రెండు నెలలు అవుతోందా? మరి నిన్నటినుంచీ మాతో ఉన్నదెవరు??
(చివరి భాగం రేపు)
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
Labels:
కథలు
Monday 16 November 2009
రీయూనియన్ -1 (నా మొదటి సస్పెన్స్ కథ)
ఫోను గణగణా మ్రోగుతోంది. గాఢనిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను. గడియారం అయిదు గంటలు చూపిస్తోంది. ఎవరో ఇండియానుంచి. ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ ఎత్తి హలో అన్నాను వీలయినంతగా విసుగును దాచుకుంటూ. “భాస్కరం ఉన్నాడాండీ” అంటున్నారెవరో అవతల్నించి. ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. మా పల్లెలో వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ నన్నలా పిలవరు. ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి స్థిరపడిన నేను భాస్కర మూర్తిగానో లేక కె.బి.మూర్తిగానో మాత్రమే అందరికీ పరిచయం. ఆశ్చర్యాన్ని దాచుకుని బదులిచ్చా “నేనే మాట్లాడుతున్నాను, మీరెవరండీ”. అటువైపునుంచి కాస్త ఉద్విగ్నత నిండిన స్వరంతో వినిపించింది "నేనురా భాస్కరం, దివాకరాన్ని". ఒక్కసారి నేనున్నది కలో నిజమో అర్థం కాలేదు. దివాకరం పదవ తరగతి వరకూ నా సహాధ్యాయి. దాదాపు ముఫ్పై ఏళ్ళ తరువాత ఇదే వాడితో మాట్లాడటం. కుశలప్రశ్నలు, ఇద్దరమూ ఇప్పుడేం చేస్తున్నది వగైరా వివరాలన్నీ అయ్యాక చెప్పాడు అసలు సంగతి. “ఒక్కసారి శేఖరం, విశ్వేశ్వరం లను కూడా తీసుకుని పల్లెకు వస్తే చాలారోజుల తరువాత కలిసినట్టూ వుంటుంది పల్లె చూసినట్లూ వుంటుంద”ని. ఒక్క క్షణం ఆలోచించి సరేనన్నా. మరికాసేపు పిచ్చాపాటి మాట్లాడి మిగతా ఇద్దరితో ఈ విషయం చెప్పి ఒప్పించే బాధ్యత నామీద పెట్టి సెలవు తీసుకున్నాడు దివాకరం.
తిరిగి వచ్చి పడుకున్నానేగానీ నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నన్ను నోస్టాల్జియా ఆవరించింది. మేం నలుగురం పదవతరగతి వరకూ ఒక జట్టు. ఊరంతటికీ పోకిరి కుర్రాళ్ళుగా అప్పట్లో మంచి(?) పేరే వుండేది నలుగురికీ. మా పేర్ల చివరి అక్షరాలని బట్టి రమ్ బాచ్ అని పిలిచే వాళ్ళు ఊరి జనాలు. చిన్న చిన్న అల్లరి పనులనుంచీ ఒక మోస్తరు రౌడీ వేషాల వరకూ మేము చెయ్యని వెధవ పని లేదు. ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా ఆశ్చర్యంగా నలుగురం జీవితంలో మాత్రం బాగానే స్థిరపడ్డాం. శేఖరం నేను వచ్చిన అయిదేళ్ళకి అమెరికా వచ్చేశాడు. విశ్వేశ్వరం హైదరాబాదులో గవర్నమెంటు ఉద్యోగి అని విన్నాను. దివాకరం మాత్రం పల్లెలోనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా వాడితో మాట్లాడే అవకాశం వచ్చింది. తెల్లవారుతూనే శేఖరానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. తనకి పైనెలలో ఇండియా వెళ్ళాల్సిన పని ఉందనీ అప్పుడైతే వీలవుతుందనీ చెప్పాడు. నేనూ అదే సమయానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నా భార్యా పిల్లలు రావటానికి అంతగా సుముఖత చూపించలేదు, నేనూ పెద్దగా బలవంతం చెయ్యలేదు. ఎక్కువ సమయం స్నేహితులతో గడపాలంటే ఒంటరిగా వెళితేనే మంచిదని అనిపించింది నాకు. విశ్వం నంబరు కూడా సంపాదించి వాడికీ విషయం చెప్పాను. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక మేమంతా కలుసుకోబోయే రోజుకోసం ఎదురుచూడటం ప్రారంభించాను.
హైదరాబాదులో దిగగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు దివాకరం. మనిషిని చూస్తే వాడికి యాభై ఏళ్ళని నమ్మేట్లు లేదు. ఇంకా దృఢంగానే వున్న శరీరం, అక్కడక్కడా మాత్రమే నెరిసిన జుట్టు, వాడి వయసు ముప్ఫై, ముప్ఫై అయిదంటే ఎవరైనా నమ్మేస్తారు. ఎయిర్పోర్ట్ నుండి సరాసరి విశ్వం ఇంటికెళ్ళి వాడిని ఎక్కించుకుని పల్లె చేరాం. ఊరి చివర తోట బంగళాలో మా బస ఏర్పాటయ్యింది. "పల్లెలో సెల్ నెట్వర్కులేవీ పనిచెయ్యవురా, అదొక్కటి తప్పితే మీరుండటానికి ఇక ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను" అంటున్న దివాకరం వంక కృతజ్ఞతగా చూశాము ముగ్గురమూ. పూర్తి ఏకాంత ప్రదేశం. ఉదయం, సాయంత్రం వచ్చి వంటపని, ఇంటిపని చేసి పోయే ఆవిడ తప్పితే ఇంకెవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. శేఖరం ఒక పూట మాత్రం ఉండి వేరే ఏదో పని ఉందనీ అది చూసుకుని రెండు రోజుల్లో మళ్ళీ వస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి మాంచి మందు పార్టీ ఏర్పాటు చేశాడు దివాకరం. పెగ్గు మీద పెగ్గు బిగిస్తూ ముగ్గురం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. చర్చ అటు తిరిగీ ఇటు తిరిగీ మా స్నేహ బంధం మీదకు మళ్ళింది. తాగింది బాగా ఎక్కిందో ఏమో నేనూ విశ్వం "ఈ ప్రపంచంలో మాకన్నా గొప్ప స్నేహితులుండరు" అని నిర్ణయించేశాం. దివాకరం ఏదో ఆలోచిస్తూ సీరియస్ గా ఉన్నాడు. వాడేం మాట్లాడక పోయేటప్పటికి ఏమిటనడిగా. "నిజంగా మనది అంత గొప్ప స్నేహం అంటావా?" అడిగాడు వాడు. "సందేహం ఏమయినా ఉంటే చెప్పు, నిరూపించి చూపిస్తా" అన్నాడు విశ్వం. "అంటే ఇప్పుడు మీరు నాకోసం ఏమయినా చెయ్యటానికి సిధ్ధమా" అడిగాడు దివాకరం. "అడిగి చూడరా. నీకోసం చంపటానికైనా, చావడానికైనా మేం సిధ్ధమే" అన్నాను నేను సినీ ఫక్కీలో. "అవును, అడిగి చూడు, చేస్తామో చెయ్యమో నీకే తెలుస్తుంది" వంత పాడాడు విశ్వం. "నాకోసం ఒక హత్య చెయ్యాలి, చేస్తారా?" అడిగాడు దివాకరం. ఈసారి వాడి గొంతులో మందు తాలూకు నిషాలేదు. వాడడుగుతున్నది నిజంగానో లేక హాస్యానికో మా ఇద్దరికీ అర్థం కాలేదు. "సరేరా, ఇంతకీ నీకు మేం ఏం సహాయం చెయ్యాలో చెప్పు" మళ్ళీ అన్నాడు విశ్వం. "హత్య చెయ్యాలి, చెయ్యగలరా?" రెట్టించాడు దివాకరం. ఈసారి వాడి గొంతులోని కాఠిన్యం నాకు చెప్పకనే చెప్పింది వాడా మాటలు హాస్యానికి అనటంలేదని. విశ్వానికి ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు, "సరేరా, నీక్కాస్త ఎక్కువైనట్లుందిగానీ రేప్పొద్దున మాట్లాడుకుందాం" అంటూ లేవబోయాడు. "నేనడిగేది నీకంత హాస్యంగా వుందా?" అనరిచాడు దివాకరం, కోపంతో వణికిపోతూ. మేమిద్దరం ఆశ్చర్యపోయాం, సాధారణంగా దివాకరం చాలా కూల్ గా ఉంటాడు మా నలుగురిలోకీ. అలాంటిది ఇంత ఆవేశపడుతున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? వాతావరణం కాస్త తేలిక చేద్దామని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నా "సరేరా, చేస్తాం. కానీ అసలు మేమెవర్ని చంపాలో అది చెప్పు ముందు". "శేఖరాన్ని" తూటాలా తిరుగు జవాబు వచ్చింది వాడినుంచి. "ఏమిటీ?!" ఒకేసారి అరిచాం నేనూ, విశ్వం. మా ఇద్దరి నిషా దెబ్బకు దిగిపోయింది.
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
తిరిగి వచ్చి పడుకున్నానేగానీ నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా నన్ను నోస్టాల్జియా ఆవరించింది. మేం నలుగురం పదవతరగతి వరకూ ఒక జట్టు. ఊరంతటికీ పోకిరి కుర్రాళ్ళుగా అప్పట్లో మంచి(?) పేరే వుండేది నలుగురికీ. మా పేర్ల చివరి అక్షరాలని బట్టి రమ్ బాచ్ అని పిలిచే వాళ్ళు ఊరి జనాలు. చిన్న చిన్న అల్లరి పనులనుంచీ ఒక మోస్తరు రౌడీ వేషాల వరకూ మేము చెయ్యని వెధవ పని లేదు. ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా ఆశ్చర్యంగా నలుగురం జీవితంలో మాత్రం బాగానే స్థిరపడ్డాం. శేఖరం నేను వచ్చిన అయిదేళ్ళకి అమెరికా వచ్చేశాడు. విశ్వేశ్వరం హైదరాబాదులో గవర్నమెంటు ఉద్యోగి అని విన్నాను. దివాకరం మాత్రం పల్లెలోనే వ్యవసాయం చేస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా వాడితో మాట్లాడే అవకాశం వచ్చింది. తెల్లవారుతూనే శేఖరానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. తనకి పైనెలలో ఇండియా వెళ్ళాల్సిన పని ఉందనీ అప్పుడైతే వీలవుతుందనీ చెప్పాడు. నేనూ అదే సమయానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. నా భార్యా పిల్లలు రావటానికి అంతగా సుముఖత చూపించలేదు, నేనూ పెద్దగా బలవంతం చెయ్యలేదు. ఎక్కువ సమయం స్నేహితులతో గడపాలంటే ఒంటరిగా వెళితేనే మంచిదని అనిపించింది నాకు. విశ్వం నంబరు కూడా సంపాదించి వాడికీ విషయం చెప్పాను. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇక మేమంతా కలుసుకోబోయే రోజుకోసం ఎదురుచూడటం ప్రారంభించాను.
హైదరాబాదులో దిగగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు దివాకరం. మనిషిని చూస్తే వాడికి యాభై ఏళ్ళని నమ్మేట్లు లేదు. ఇంకా దృఢంగానే వున్న శరీరం, అక్కడక్కడా మాత్రమే నెరిసిన జుట్టు, వాడి వయసు ముప్ఫై, ముప్ఫై అయిదంటే ఎవరైనా నమ్మేస్తారు. ఎయిర్పోర్ట్ నుండి సరాసరి విశ్వం ఇంటికెళ్ళి వాడిని ఎక్కించుకుని పల్లె చేరాం. ఊరి చివర తోట బంగళాలో మా బస ఏర్పాటయ్యింది. "పల్లెలో సెల్ నెట్వర్కులేవీ పనిచెయ్యవురా, అదొక్కటి తప్పితే మీరుండటానికి ఇక ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాను" అంటున్న దివాకరం వంక కృతజ్ఞతగా చూశాము ముగ్గురమూ. పూర్తి ఏకాంత ప్రదేశం. ఉదయం, సాయంత్రం వచ్చి వంటపని, ఇంటిపని చేసి పోయే ఆవిడ తప్పితే ఇంకెవ్వరూ మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు. శేఖరం ఒక పూట మాత్రం ఉండి వేరే ఏదో పని ఉందనీ అది చూసుకుని రెండు రోజుల్లో మళ్ళీ వస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి మాంచి మందు పార్టీ ఏర్పాటు చేశాడు దివాకరం. పెగ్గు మీద పెగ్గు బిగిస్తూ ముగ్గురం ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. చర్చ అటు తిరిగీ ఇటు తిరిగీ మా స్నేహ బంధం మీదకు మళ్ళింది. తాగింది బాగా ఎక్కిందో ఏమో నేనూ విశ్వం "ఈ ప్రపంచంలో మాకన్నా గొప్ప స్నేహితులుండరు" అని నిర్ణయించేశాం. దివాకరం ఏదో ఆలోచిస్తూ సీరియస్ గా ఉన్నాడు. వాడేం మాట్లాడక పోయేటప్పటికి ఏమిటనడిగా. "నిజంగా మనది అంత గొప్ప స్నేహం అంటావా?" అడిగాడు వాడు. "సందేహం ఏమయినా ఉంటే చెప్పు, నిరూపించి చూపిస్తా" అన్నాడు విశ్వం. "అంటే ఇప్పుడు మీరు నాకోసం ఏమయినా చెయ్యటానికి సిధ్ధమా" అడిగాడు దివాకరం. "అడిగి చూడరా. నీకోసం చంపటానికైనా, చావడానికైనా మేం సిధ్ధమే" అన్నాను నేను సినీ ఫక్కీలో. "అవును, అడిగి చూడు, చేస్తామో చెయ్యమో నీకే తెలుస్తుంది" వంత పాడాడు విశ్వం. "నాకోసం ఒక హత్య చెయ్యాలి, చేస్తారా?" అడిగాడు దివాకరం. ఈసారి వాడి గొంతులో మందు తాలూకు నిషాలేదు. వాడడుగుతున్నది నిజంగానో లేక హాస్యానికో మా ఇద్దరికీ అర్థం కాలేదు. "సరేరా, ఇంతకీ నీకు మేం ఏం సహాయం చెయ్యాలో చెప్పు" మళ్ళీ అన్నాడు విశ్వం. "హత్య చెయ్యాలి, చెయ్యగలరా?" రెట్టించాడు దివాకరం. ఈసారి వాడి గొంతులోని కాఠిన్యం నాకు చెప్పకనే చెప్పింది వాడా మాటలు హాస్యానికి అనటంలేదని. విశ్వానికి ఇంకా నమ్మకం కుదిరినట్లు లేదు, "సరేరా, నీక్కాస్త ఎక్కువైనట్లుందిగానీ రేప్పొద్దున మాట్లాడుకుందాం" అంటూ లేవబోయాడు. "నేనడిగేది నీకంత హాస్యంగా వుందా?" అనరిచాడు దివాకరం, కోపంతో వణికిపోతూ. మేమిద్దరం ఆశ్చర్యపోయాం, సాధారణంగా దివాకరం చాలా కూల్ గా ఉంటాడు మా నలుగురిలోకీ. అలాంటిది ఇంత ఆవేశపడుతున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? వాతావరణం కాస్త తేలిక చేద్దామని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నా "సరేరా, చేస్తాం. కానీ అసలు మేమెవర్ని చంపాలో అది చెప్పు ముందు". "శేఖరాన్ని" తూటాలా తిరుగు జవాబు వచ్చింది వాడినుంచి. "ఏమిటీ?!" ఒకేసారి అరిచాం నేనూ, విశ్వం. మా ఇద్దరి నిషా దెబ్బకు దిగిపోయింది.
(ఇది నా మొదటి ప్రయత్నం. బాగుందనిపిస్తే చెప్పండి. బాగాలేదనిపిస్తే మాత్రం తప్పక చెప్పండి. మీ సలహాలూ, సూచనలకు స్వాగతం.)
Labels:
కథలు
Thursday 13 August 2009
యండమూరి, నేను మరియు నా స్వార్థం
కొంతకాలం క్రితం చదివిన యండమూరి నవల ఆనందో బ్రహ్మలోని ఒక సన్నివేశం నాకు జరిగిన కొన్ని స్వానుభవాల వల్ల అలా మనసులో నిలిచిపోయింది. సన్నివేశం క్లుప్తంగా - "నవల్లో ఒక పాత్రకి భారత దేశమ్మీద జరగబోయే అణుదాడి గురించి ముందుగా సమాచారం తెలుస్తుంది. తనకున్న ముఖ్యమైన వస్తువులని వెంటపెట్టుకుని వీలైనంత త్వరగా తనుంటున్న ప్రదేశానికి దూరంగా పారిపొమ్మని అతడికి పరిచయమున్న ఒక సైనికాధికారి చెపుతాడు. దాన్ననుసరించి అతడు తనక్కావాల్సిన అత్యవసర వస్తువులు తీసుకుని భార్యా పిల్లలతోటి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. తీరా కారెక్కబోతుండగా అతడికి ఓల్డేజ్ హోం లో చేర్పించిన తండ్రి విషయం గుర్తొస్తుంది. తనతో పాటు తీసుకెళ్ళాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో/మనుషుల్లో ఒకడిగా తండ్రిని పరిగణించనందుకు చాలా బాధపడతాడు." ఇది చదివినప్పుడు కాస్త అతిశయోక్తిగా అనిపించింది. అంత మెటీరియలిస్టిగ్గా మనుషులుంటారని అప్పటికింకా అనుభవంలోకి రాకపోవడమే అందుకు కారణం.
ఏడెనిమిది నెల్ల క్రితం, ముంబాయి టెర్రరిస్టు దాడులు జరిగిన కొత్తల్లో ఒక చిన్న అకారణమైన భయం - ఈసారి లక్ష్యం పుణె అవుతుందేమో అని - నా సబ్ కాన్షస్ లో ఏమూలో నాటుకుపోయింది. ఒకరోజు అలవాటు ప్రకారం మా అబ్బాయిని బళ్ళో దించటానికి వెళ్ళా. బండి పార్క్ చేసి పైకి వెళ్ళి దింపివస్తూంటే వాళ్ళ ప్రిన్సిపాల్ కనిపించి మావాడి గురించి ఏదో మాట్లాడాలంది. సరేనని ఆవిడతో ఆ విషయమేదో మాట్లాడి కిందికొచ్చా. పార్కింగ్ లోనించి నా బండిని తీస్తుండగా యదాలాపంగా గమనించా దాని పక్కనే పార్క్ చేసిన మరో బండిని, దానికి వేళ్ళాడుతున్న ఒక చేతి సంచిని. ఇందాక పైకి వెళ్ళేటప్పుడు చూసినట్లే వుంది కానీ హడావుడిలో అంతగా పట్టించుకోలేదు. బాంబేమో? చాలాసేపట్నించీ ఇక్కడే వున్నట్లుంది?? ఒక్కసారిగా నా వెన్ను జలదరించినట్లైంది. ఇక ఏమీ అలోచించుకోవటానికి అవకాశమివ్వలేదు నా మెదడు. బైకును స్టార్ట్ కూడా చెయ్యకుండా అలాగే కాళ్ళతో నెట్టుకుంటూ ఓపదడుగుల దూరం వెళ్ళాక నాలో విచక్షణ మేలుకుంది. "ఒకవేళ అది నిజంగా బాంబే అయితే పక్కనే వున్న బళ్ళో పిల్లల పరిస్థితి ఏమిటి? అదేబళ్ళో మా అబ్బాయి కూడా వున్నాడన్న విషయం కూడా మరిచిపోయి నా ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను నేను. ఛ ఛ!" అనిపించింది. బండి ఆపి మరో అయిదు నిమిషాలు చూసి ఈలోగా ఆ రెండో బైక్ తాలూకు ఎవరూ రాకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే ఎవరో వచ్చి ఆ బండి తీసుకెళ్ళటంతో హమ్మయ్య అనిపించింది కానీ నేను మొదట స్పందించిన తీరు మాత్రం నన్ను చాలా సిగ్గు పడేలా చేసింది.
అలాగే రెండురోజుల క్రితం జరిగిన మరో సంఘటన. అందరికీ తెలుసు స్వైన్ ఫ్లూ పుణెలో ఎలా స్వైరవిహారం చేస్తోందో. మీడియా పుణ్యమాని జనాల్లో అవసరమైనదానికన్నా ఎక్కువే అవేర్నెస్(పానిక్ అనొచ్చేమో) వచ్చేసింది. గుంటూర్నించి మా అమ్మా వాళ్ళూ, అత్తగారు వాళ్ళూ ప్రతి పూటా ఫోన్లు చేసి కుశలం అడగటం మొదలుపెట్టారు. నేనూ మొదట్లో అంతగా పట్టించుకోలేదుగానీ హైరిస్క్ గ్రూపుల్లో ఐయిదేళ్ళలోపు పిల్లలున్నారని తెలిసినప్పట్నుంచీ మాత్రం మావాడెక్కడ దానిపాలబడతాడో అని భయం మొదలైంది. ఇక ప్రతిక్షణం వాడు తుమ్మినా, దగ్గినా ఉలిక్కిపడటం, వాడికి జలుబులాంటివి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవటం, టెంపరేచర్ గమనిస్తూండటం వగైరాలతో కాస్త టెన్షన్ గానే గడుపుతున్నాము. రెండ్రోజుల క్రితం పేపర్నిండా వున్న స్వైన్ ఫ్లూ వార్తలు చదువుతున్నాను. రోజూ వేసినట్లే ఆరోజు కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు, జాగ్రత్తలు, ఎవరికి ఎక్కువ ప్రమాదకరం వగైరాలతో ఒక పట్టిక వుందక్కడ. పేపర్ తిప్పెయ్యబోతుండగా వెలిగింది బుర్రలో - స్వైన్ ఫ్లూ డయాబెటిక్ లకు అత్యంత ప్రమాదకరం. మా నాన్నగారు, అత్తగార్లు డయాబెటిస్ తో ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నారు. మానాన్నగారికైతే రోజూ ఇన్సులిన్ తీసుకోకపోతే నడవని పరిస్థితి. స్వైన్ ఫ్లూ ఆంధ్రలో వ్యాపించే అవకాశాలు పుష్కలంగా వున్న పరిస్థితుల్లో(అలా జరక్కూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా), వీళ్ళిద్దరూ ప్రమాదంలో వున్నారన్న సంగతే నాకప్పటిదాకా స్ఫురించలేదు. నిజంగానే ఆంధ్రలో ఆ వైరస్ వ్యాపిస్తే నేనిక్కడినించి చెయ్యగలిగేది ఏమీ వుండదు. కానీ కనీసం జాగ్రత్తగా వుండమనైనా చెప్పలేకపోయాను నేను. నా భార్యా బిడ్డల గురించి తప్ప స్వంత తల్లిదండ్రుల గురించి కూడా అలోచించలేనంత స్వార్థంలో కూరుకుపోయానా అనిపించింది.
సాధారణంగా దేవుడిని నేనేమీ కోరుకోను. మహా అయితే సర్వేజనా సుఖినోభవంతు అని ప్రార్థిస్తా, ఆ సర్వ జనుల్లో నేను, నా కుటుంబం ఎలాగూ వుంటుందికదా అన్న నమ్మకంతో. కానీ ఈ రెండు సంఘటనల తరువాత అనిపిస్తోంది ఆ ప్రార్థన ఒట్టి నాలుక చివరి ప్రార్థనేనా, మనసులోంచి వస్తోంది కాదా అని. ఏమో. ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇప్పుడు. యండమూరిది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు - కనీసం నా విషయంలో.
ఏడెనిమిది నెల్ల క్రితం, ముంబాయి టెర్రరిస్టు దాడులు జరిగిన కొత్తల్లో ఒక చిన్న అకారణమైన భయం - ఈసారి లక్ష్యం పుణె అవుతుందేమో అని - నా సబ్ కాన్షస్ లో ఏమూలో నాటుకుపోయింది. ఒకరోజు అలవాటు ప్రకారం మా అబ్బాయిని బళ్ళో దించటానికి వెళ్ళా. బండి పార్క్ చేసి పైకి వెళ్ళి దింపివస్తూంటే వాళ్ళ ప్రిన్సిపాల్ కనిపించి మావాడి గురించి ఏదో మాట్లాడాలంది. సరేనని ఆవిడతో ఆ విషయమేదో మాట్లాడి కిందికొచ్చా. పార్కింగ్ లోనించి నా బండిని తీస్తుండగా యదాలాపంగా గమనించా దాని పక్కనే పార్క్ చేసిన మరో బండిని, దానికి వేళ్ళాడుతున్న ఒక చేతి సంచిని. ఇందాక పైకి వెళ్ళేటప్పుడు చూసినట్లే వుంది కానీ హడావుడిలో అంతగా పట్టించుకోలేదు. బాంబేమో? చాలాసేపట్నించీ ఇక్కడే వున్నట్లుంది?? ఒక్కసారిగా నా వెన్ను జలదరించినట్లైంది. ఇక ఏమీ అలోచించుకోవటానికి అవకాశమివ్వలేదు నా మెదడు. బైకును స్టార్ట్ కూడా చెయ్యకుండా అలాగే కాళ్ళతో నెట్టుకుంటూ ఓపదడుగుల దూరం వెళ్ళాక నాలో విచక్షణ మేలుకుంది. "ఒకవేళ అది నిజంగా బాంబే అయితే పక్కనే వున్న బళ్ళో పిల్లల పరిస్థితి ఏమిటి? అదేబళ్ళో మా అబ్బాయి కూడా వున్నాడన్న విషయం కూడా మరిచిపోయి నా ప్రాణాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను నేను. ఛ ఛ!" అనిపించింది. బండి ఆపి మరో అయిదు నిమిషాలు చూసి ఈలోగా ఆ రెండో బైక్ తాలూకు ఎవరూ రాకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాను. అంతలోనే ఎవరో వచ్చి ఆ బండి తీసుకెళ్ళటంతో హమ్మయ్య అనిపించింది కానీ నేను మొదట స్పందించిన తీరు మాత్రం నన్ను చాలా సిగ్గు పడేలా చేసింది.
అలాగే రెండురోజుల క్రితం జరిగిన మరో సంఘటన. అందరికీ తెలుసు స్వైన్ ఫ్లూ పుణెలో ఎలా స్వైరవిహారం చేస్తోందో. మీడియా పుణ్యమాని జనాల్లో అవసరమైనదానికన్నా ఎక్కువే అవేర్నెస్(పానిక్ అనొచ్చేమో) వచ్చేసింది. గుంటూర్నించి మా అమ్మా వాళ్ళూ, అత్తగారు వాళ్ళూ ప్రతి పూటా ఫోన్లు చేసి కుశలం అడగటం మొదలుపెట్టారు. నేనూ మొదట్లో అంతగా పట్టించుకోలేదుగానీ హైరిస్క్ గ్రూపుల్లో ఐయిదేళ్ళలోపు పిల్లలున్నారని తెలిసినప్పట్నుంచీ మాత్రం మావాడెక్కడ దానిపాలబడతాడో అని భయం మొదలైంది. ఇక ప్రతిక్షణం వాడు తుమ్మినా, దగ్గినా ఉలిక్కిపడటం, వాడికి జలుబులాంటివి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవటం, టెంపరేచర్ గమనిస్తూండటం వగైరాలతో కాస్త టెన్షన్ గానే గడుపుతున్నాము. రెండ్రోజుల క్రితం పేపర్నిండా వున్న స్వైన్ ఫ్లూ వార్తలు చదువుతున్నాను. రోజూ వేసినట్లే ఆరోజు కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు, జాగ్రత్తలు, ఎవరికి ఎక్కువ ప్రమాదకరం వగైరాలతో ఒక పట్టిక వుందక్కడ. పేపర్ తిప్పెయ్యబోతుండగా వెలిగింది బుర్రలో - స్వైన్ ఫ్లూ డయాబెటిక్ లకు అత్యంత ప్రమాదకరం. మా నాన్నగారు, అత్తగార్లు డయాబెటిస్ తో ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నారు. మానాన్నగారికైతే రోజూ ఇన్సులిన్ తీసుకోకపోతే నడవని పరిస్థితి. స్వైన్ ఫ్లూ ఆంధ్రలో వ్యాపించే అవకాశాలు పుష్కలంగా వున్న పరిస్థితుల్లో(అలా జరక్కూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా), వీళ్ళిద్దరూ ప్రమాదంలో వున్నారన్న సంగతే నాకప్పటిదాకా స్ఫురించలేదు. నిజంగానే ఆంధ్రలో ఆ వైరస్ వ్యాపిస్తే నేనిక్కడినించి చెయ్యగలిగేది ఏమీ వుండదు. కానీ కనీసం జాగ్రత్తగా వుండమనైనా చెప్పలేకపోయాను నేను. నా భార్యా బిడ్డల గురించి తప్ప స్వంత తల్లిదండ్రుల గురించి కూడా అలోచించలేనంత స్వార్థంలో కూరుకుపోయానా అనిపించింది.
సాధారణంగా దేవుడిని నేనేమీ కోరుకోను. మహా అయితే సర్వేజనా సుఖినోభవంతు అని ప్రార్థిస్తా, ఆ సర్వ జనుల్లో నేను, నా కుటుంబం ఎలాగూ వుంటుందికదా అన్న నమ్మకంతో. కానీ ఈ రెండు సంఘటనల తరువాత అనిపిస్తోంది ఆ ప్రార్థన ఒట్టి నాలుక చివరి ప్రార్థనేనా, మనసులోంచి వస్తోంది కాదా అని. ఏమో. ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇప్పుడు. యండమూరిది అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు - కనీసం నా విషయంలో.
Subscribe to:
Posts (Atom)

